ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

శ్రీవారికి ప్రేమలేఖ - వసుంధర

వసుధర కథలు పుస్తకం నుంచి "మన దేశంలో ప్రతి భర్తా భోజరాజు, ప్రతి భార్యా కాళిదాసు. వారి అనుబంధాల నుంచి పుట్టిన జీవిత ప్రబంధాల ముందు కాళిదాసు ప్రబంధాలు కూడా వెలవెలబోక తప్పదు." "మీ తొలిరాత్రి అనుభవాలు నాకు చెప్పాలి. ఏ సంకోచమూ లేకుండా జరిగింది జరిగినట్లు చెప్పాలి. మీ వివరాలు రహస్యంగా వుంచబడతాయి. మీరు నిజీయితీ పటిస్తే అందువల్ల ఎందరో యువతి యువకులకు ఎంతో ప్రయోజనం" అంది కుసుమ. ఆ గదిలో వున్న ఆరుగురు ఆడవాళ్ళూ ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్ళక్కడ  పోసుకోలు కబుర్లకు చేరారు. కబుర్ల మధ్యలో శృంగారం చోటుచేసుకోబోతే తనకి ఆసక్తిలేనట్లుగా ముఖం చిట్లించింది గూడా, వారిలో జయ అనబడే ఆమె. మిగతా అయిదుగురూ ఆ పేటవారే! జయమాత్రం ఏదో పనిమీద పుట్టింటికి వచ్చి పదిరోజులైంది. ఇంకో రెండువారాలుంటుంది. జయకు వయసు ౩౦-౩౫ మధ్యలో వుంటుంది. పద్ధెనిమిదో ఏట పెళ్ళై కాపురానికి వెళ్ళింది. ఇద్దరు పిల్లల దల్లి అయినా బయటివాళ్ళతో ఆ కబుర్లు ఏ సందర్భంలోనూ మాట్లాడదు. మనిషి కూడా గంభీరంగానూ, హుందాగానూ వుంటుంది. పుట్టింటికెప్పుడొచ్చినా అమ్మలక్కలామెను అభిమానంగా పిలుస్తుంటారు. అందరితోనూ మంచిగా వుంటూ అందరి గురించీ మంచే

వేమన యోగసిద్ధి - మత ప్రచారము

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి 'వేమన' పుస్తకం నుంచి సకల జగత్కారణమైన మూలవస్తువొకటి కలదని మన ప్రాచీనులు వేలకొలఁది యేండ్ల క్రిందనే గ్రహించిరి. దాని తత్త్వము నెఱిఁగిన పక్షమున, సృష్టియందలి సందేహములకెల్ల నందు ప్రత్యుత్తరములు లభించుననియు, బంధములన్నియు నుడుగుననియుఁ దలఁచిరి - "భిద్యతే హృదయగ్రన్థి శ్చిద్యన్తే సర్వసంశయాః క్షీయన్తే సర్వకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే" అది సగుణమయినను నిర్గుణమైనను శూన్యమైనను దాని స్వరూపము ననుభవపూర్వకముగ నెఱుఁగక తీఱదని తేలినది. కాని దాని నెఱుఁగుట యెట్లు? మితమైన శక్తిగల కన్ను ముక్కు మొదలగు బహిరింద్రియములచే సాధ్యముగాదు. సాధ్యమైనచో అమితమైన ప్రభావముగల మనస్సను అంతరింద్రియముచేతనే కావలయును. కాని యీ మనస్సు చంచలమైనది. నిమేష కాలమైనను ఒకవిషయమును ధ్యానించు దార్ఢ్యములేనిది. దానికితోడు శరీరమందును సంసారమందును గలుగు వివిధావస్థలు దానిని ఒకచోట నిలువనీయవు. కావున మనస్సు ఈ దేహమునకును బహిస్సంసారమునకును లోబడక తనంతట అఖండముగా నిలిచి కార్యమును నిర్వహించు మార్గమొకటి వెదకవలసివచ్చెను. అదే యోగము - "యదా పఞ్చావరిష్ఠన్తే జ్ఞానాని మనసాసహ బుద్ధిశ్చన విచేష్టతి తామాహుః పరమా

ఆంధ్రకవితా పితామహ అల్లసాని పెద్దన

'పెద్దన' పుస్తకం నుంచి(రచయిత పేరు గుర్తులేదు) పెద్దన్న గారికి ' ఆంధ్రకవితాపితామహుఁ 'డని బిరుదు శ్రీకృష్ణదేవరాయలవారిచ్చినది. కృష్ణరాయఁడు విద్వత్ప్రభువు, భావుకుడు. సహజముగా గొప్పకవి. ఆ ప్రభువునకు తత్పూర్వమున కవిత్రయము, పోతన్న, శ్రీనాథుఁడు మొదలైన మహానుభావులున్నారని తెలియదా? నాచన సోమనయున్నాడని తెలియదా! పెద్దన్న కీ బిరుదిచ్చట యేమి? తాను వైష్ణవ ప్రభువు. పెద్దన్నకూడ వైష్ణవుఁడే. ఈ కారణముచేత నిచ్చెనా? లేదా, ఆంధ్రకవిత యనగా, కృష్ణరాయని యభిమతము వేఱా? తత్పూర్వకవులందఱు సంస్కృతకావ్యములు తెలుగు చేసిరి. తొలుదొల్త స్వతంత్రకావ్యమును తెలుగులో పెద్దన గారే వ్రాసిరి. అందుచేత నిచటినుండియే యాంధ్రకవితాప్రారంభ మనియా?  పెద్దన్నగారును మార్కండేయ పురాణములోని కథను స్వీకరించియే వ్రాసిరి. పూర్వకవుల తెల్లగుసేతయు మక్కికి మక్కిగా లేదు. కనుక నిదియే యాంధ్రకవితాసమారంభ మనుటకు రాయల వారి బుద్ధిలో పద్యరచన యని కాదు. తెలుగు సేత కాదు. స్వతంత్రకావ్య మనిపించుకోదగిన యాంధ్రగ్రంథమని నిర్ణయము చేసికోవచ్చును. ఇచట ప్రాధాన్యము కావ్యశబ్దమునకు. ఈ లెక్కను భారతము కావ్యము కాసింత పెంపులు, తగ్గింపు లున్నను తెలుగులో స్వతంత్రకావ్యమ