ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంధ్రకవితా పితామహ అల్లసాని పెద్దన

'పెద్దన' పుస్తకం నుంచి(రచయిత పేరు గుర్తులేదు)

పెద్దన్న గారికి 'ఆంధ్రకవితాపితామహుఁ'డని బిరుదు శ్రీకృష్ణదేవరాయలవారిచ్చినది. కృష్ణరాయఁడు విద్వత్ప్రభువు, భావుకుడు. సహజముగా గొప్పకవి. ఆ ప్రభువునకు తత్పూర్వమున కవిత్రయము, పోతన్న, శ్రీనాథుఁడు మొదలైన మహానుభావులున్నారని తెలియదా? నాచన సోమనయున్నాడని తెలియదా! పెద్దన్న కీ బిరుదిచ్చట యేమి? తాను వైష్ణవ ప్రభువు. పెద్దన్నకూడ వైష్ణవుఁడే. ఈ కారణముచేత నిచ్చెనా?

లేదా, ఆంధ్రకవిత యనగా, కృష్ణరాయని యభిమతము వేఱా? తత్పూర్వకవులందఱు సంస్కృతకావ్యములు తెలుగు చేసిరి. తొలుదొల్త స్వతంత్రకావ్యమును తెలుగులో పెద్దన గారే వ్రాసిరి. అందుచేత నిచటినుండియే యాంధ్రకవితాప్రారంభ మనియా?  పెద్దన్నగారును మార్కండేయ పురాణములోని కథను స్వీకరించియే వ్రాసిరి. పూర్వకవుల తెల్లగుసేతయు మక్కికి మక్కిగా లేదు. కనుక నిదియే యాంధ్రకవితాసమారంభ మనుటకు రాయల వారి బుద్ధిలో పద్యరచన యని కాదు. తెలుగు సేత కాదు. స్వతంత్రకావ్య మనిపించుకోదగిన యాంధ్రగ్రంథమని నిర్ణయము చేసికోవచ్చును. ఇచట ప్రాధాన్యము కావ్యశబ్దమునకు. ఈ లెక్కను భారతము కావ్యము కాసింత పెంపులు, తగ్గింపు లున్నను తెలుగులో స్వతంత్రకావ్యము కాదు. శ్రీనాథుని నైషధము కాదు. భాగవతమును గాదు.

కావ్యలక్షణములు పట్టించినచో మనుచరిత్రయే ప్రథమ కావ్యము. ఒక గ్రంథమును కావ్యముగా నిర్ణయించ వలసివచ్చినప్పుడు ప్రసిద్ధమైన మార్గమ`కటి కలదు. ఏకరసాశ్రయమైన కథ. శృంగారరస మైనచో నాయికానాయకులు, తదితరరసములకు తత్తదుచితలక్షములు, ప్రధానరసము, అంగరసములు, వాని పొసగింపు, నాయకలక్షణము మొదలైనవాని పరామర్శ. ఇది ప్రసిద్ధమైన కావ్యలక్షణము.

రెండవది ప్రసిద్ధమైనది కాదు, అనగా బహుజనుల చేత పర్యలోచింపఁబడుచున్నది కాదు. ఒక్కొకపడీ రెండవలక్షణము మొదటి లక్షణముగల కావ్యమునిండ నిండియుండవచ్చును. ఈ కావ్యలక్షణము శిల్పముతో కూడినది. శిల్పశబ్దము సునిర్దిష్టార్థకము కాదు. శిల్ప మన్నమాట సారస్వతములోనికి గౌణార్థముగా తెచ్చికొన్నదికాని, సారస్వతమునకు సహజమైనది కాదు.

ఇంకా వుంది.....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి...

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు - ఆరుద్ర

ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో  ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు? ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతాని...