ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

వామనావతారము - బ్రహ్మాండం - wormhole - multiverse

Wormhole A wormhole is a shortcut through spacetime. It is much like a tunnel with two ends, each in a separate points in spacetime. అంటే "wormhole" ద్వారా వేరే కాలానికి గాని, వేరే ప్రదేశానికి గాని ఉన్నపళంగా వెళ్ళొచ్చన్నమాట. Multiverse మనం అనుకొనే "universe" ఒకటే కాదు అలాంటివి బోలెడు వుంటాయి, వాటినే "multiverse" అంటారు. Bubble packing లో వుండే ఒక్కొక్క బుడగ ఒక్కొక్క universe(బ్రహ్మాండం), ఒకదానితో మరొకటికి సంబంధం వుండదు. ఇలా సంబంధం లేని రెండు universes(బ్రహ్మాండాల) మద్య  "wormhole" తో సంబంధం సాధ్యమవుతుంది అనుకొంటే, వామనావతారానికి ముందు మన బ్రహ్మాండంలో గంగానది లేదు. వామనమూర్తి ఈ భూమ్మీద అవతరించటానికి ఇంకొక కారణము గంగానదిని మన బ్రహ్మాండంలోని భూమ్మీదకు తేవటం. "ఇంతింతై వటుడింతయై" అని వామనమూర్తి పెరుగుతూ వేరే బ్రహ్మాండం నుంచి మన బ్రహ్మాండానికి ఒక చిన్న రంధ్రం చేశాడు.  వామనుడు చేసిన ఆ రంధ్రం "wormhole" ఆ? (మన బ్రహ్మాండంలో భూమి ఒక చిన్న భాగం.  బ్రహ్మాండం గుడ్డు ఆకారంలో మూసుకుపోయి వుంటుంది.) మూలము: www.quora.com, గర
ఇటీవలి పోస్ట్‌లు

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి నిదర్శనం - శ్రీకాకుళ క్షేత్రంలో వెలసిన శ్రీ ఆంధ్ర మహావిష్ణువే స్వయంగా శ్రీకృష్ణదేవరాయల వారికి స్వప్నంలో సాక్షాత్కరించి అన్న మాటలు - " తెలుగదేల యన్న దేశంబు తెలుగేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు దెలుగు లెస్స!" కన్నడ రాయడైన శ్రీకృష్ణదేవరాయలవారిని కావ్యం కన్నడంలో కాక తెలుగులో చెప్పమనడానికి కారణం - తాను తెలుగు వల్లభుడవటమే కాకుండా, దేశ భాష లన్నిటిలోనూ తెలుగుకు విశిష్టత గూడా వుంది కనుక - అంటాడు ఆ ప్రభువు. ఆంధ్ర

భాషలో - తమాషాలు - ౧

ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి పుస్తకం నుంచి "మేష్టారూ! ఈ తెలుగు వాక్యాలు ఎంత "చెవికిం(కం)పుగా" ఉన్నాయో చిత్తగించండి - ౧. మద్యము సేవించువారు తమ శరీరములో పోషక పదార్థాల లేమిని కలిగియుందురు. ౨. స్పీకరు సభ్యునితో ప్రమాణము చేయించెను. ౩. ఈ కమిటీచే మంత్రులు ఎన్నుకొనబడగూడదు. ౪. మన దేశమును ఆంధ్రమని పిలుతురు ౫. ఈ సభలో మాతో సహకరించి నిశ్శబ్దముగా కూర్చుండుడు. ౬. నిన్న బజారులో ఎవనిని చూచితినో వాడే నేడు మా యింటివద్ద ప్రత్యక్షమైనాడు. వ్యాకరణరీత్యా చూస్తే పై వాక్యాలలో ఏమీ తప్పున్నట్టు కనబడదు. కాని, అందులో ఏదో ఒక జీవలక్షణం లోపించి ఎబ్బెట్టుగా ఉన్నట్టుంది. లోపం ఎక్కడ ఉందంటారు.?" "జగన్నాథం ! నీ ఆవేదన నా కర్థమయింది. వాక్యంలో ఏవైనా అపశబ్దాలుంటే - అవి పొరపాటుగా వచ్చాయనో, సరియైన పరిజ్ఞానం లేక పడ్డాయనో అనం సరిపెట్టుకోవచ్చు. తిరిగి సరిచూచుకొని దిద్దుకోవచ్చు. కాని నీ చెవికి కటువుగా వినిపించినవి అపశబ్దాలు కావు, అపవాక్యాలు! ఒక దేశీయుడు పలికే వాక్యానికి ఒక జీవలక్షణం వుంటుంది. అతడు వాక్యం కూర్చేతీరు, విభక్తి అతికే విధం, పలికించే కాకువు, ఒక ప్రత్యేక లక్షణంతో వుంటుంది. దానినే ను

భాషలో తమాషాలు - ౨

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి పుస్తకం నుంచి ఒక సాహిత్యాభిమాని నాకు వ్రాసిన జాబులోని కొన్ని వాక్యాలు ఇక్కడ ఉదాహరిస్తున్నాను. "గౌరవ్యులగు ఫలానా వారికి - అయ్యా, 'సమర్ధవంతం'గా కృషిచేస్తే మానవ 'మేధస్సు' సాధించలేని దేదీ లేదు. మిత్రులతో చేసిన చర్చల్లో నాకు 'సమైక్యత' కుదరలేదు." ఆయన వాక్యాలలోని కొన్ని శబ్దాల పరిశుద్ధి నాకు సందేహాస్పదం అయింది. గౌరవ్యులు - గౌరవార్హులు అని ఆయన ఉద్దేశమనుకుంటాను. ఇది ఉజ్జాయింపుగా తయారుచేసిన కృతక శబ్దం. గురు శబ్దం మీద భావార్ధక ప్రత్యయం చేరిస్తే గౌరవం అవుతుంది. దీని మీద కొందరు 'ఆనీయ' అనే ప్రత్యయం చేర్చి 'గౌరవనీయం' అని వ్రాయడం మొదలుపెట్టారు. అది శాస్త్రీయం కాదు. సుబంత శబ్దానికి 'అనీయ' చేరదు. అది ధాతువుకు చేరవలసినది. 'మహ్' ధాతువు కనక దానికి అనీయ చేరితే మహనీయ అవుతుంది. అట్లాగే పూజనీయ, మాననీయ, ప్రార్ధనీయ, వంటి శబ్దాలు పుడతాయి. ఈ అర్థంలో గౌరవార్హులు, గౌరవాస్పదులు అనవలసి వుంటుంది. కావలిస్తే గౌరవనేయ అనవచ్చు. కొంచెం కొత్త అనిపించినా - గౌరవ్యులు అనేది ఏ విధంగానూ సమర్థనీయం కాదు. గౌరవ శబ్దానికి వారుద్దేశించ

అగస్త్యుడు

శ్రీ రామరక్ష : జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రము తిన్న గుగ్గిళ్ళు జీర్ణమై ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణమై భీముడు తిన్న పండివంటలు జీర్ణమై అర్జునుడు తిన్న అప్పాలు జీర్ణమై అబ్బాయి తిన్న పాలు ఉగ్గు జీర్ణమై కుంది లాగా కూర్చొని నంది లాగా లేచి తాంబేలు లాగా తాళి చల్లగా ఉండాలి శ్రీరామ రక్ష నూరేళ్ళాయుస్సు తి.తి.దే వారి హిందూ ధర్మ పరిచయం పుస్తకం నుంచి - శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారు బిడ్డకు వుగ్గుపెట్టి పొట్ట నిమురుతూ మెల్లిగా కాలుచేతులు ముడిచి సాగదీస్తూ తల్లులు ఈ పాట పాడుతారు. తనబిడ్డ అగస్త్యుడిమాదిరి తిన్నది అరిగించుకుని దినదినాభివృద్ధి పొందుతూ ఆరోగ్యవంతుడై, ఆయుష్మంతుడై సుఖంగా వుండాలని తల్లి కోరుకుంటుంది. ప్రాతః స్మరణీయుడైన ఈ అగస్త్యుడు దైవాంశసంభూతుడు. మహా తపస్వి. ఉదారచరితుడు. కరుణాస్వభావుడు. వీర్యవిక్రమసంపన్నుడు. ఆయన త్యాగమయ జీవితం చతుర్యుగాలకు విస్తరించి వుంది. జననం:            అగస్త్యుడు మనమాదిరి మాతృగర్భం నుంచి ఉదయించలేదు. కలశం నుంచి ఉద్భవించాడు. ఆయన పుట్టుక బహు విచిత్రమైనది. ఇక్ష్వాకు పుత్రుడైన నిమి అనే రాజు తన కులపురోహితుడైన వసిష్ఠ మహర్షితో "నేను ఒక

ధర్మపాల విజయము

ఉత్తర భారతావనిలో కళలకు కాణాచియై కళ్యాణపురంబు కలదు. అందు శిల్పకళాకోవిదుడైన విశ్వకర్మ వంశీయుడగు ధర్మపాలుడు అను శిల్పాచార్యుడు కలడు. అతడు విద్యలలో బృహస్పతితో సమానుడు. సకల శాస్త్ర మంత్రసిద్ధుడు. అతని శిల్పచాతుర్యమునకు ప్రభువులు మెచ్చి అర్థాసనమిచ్చి గౌరవించిరి. అతనినాశ్రయించి ఎందరో శిల్పకళాకోవిదులు జీవించుచున్నారు. అతని శిల్పశాలయందు అగ్ని, జల, వాయు యంత్రములు అమర్చబడియున్నవి. ఆ కళాక్షేత్రమున కులదైవములగు శ్రీ విశ్వకర్మ భగవానుడు, శ్రీ కామాక్షిదేవి ఆలయములు నిర్మించి ప్రతిష్టించి నిత్యము శిల్పాచార్యులు ఆరాధించుచుందురు. ఆ ధర్మపాలునకు రుద్రసేన, భద్రసేన, ఇంద్రసేనులను కుమారులు గలరు. వారు తండ్రితో సమాన ప్రతిభావంతులు. నియమ నిష్టాగరిష్టులు, మంత్రవేత్తలు. గదా, ఖడ్గ, బాణ యుద్ధములలో నిపుణులు. ఆ శిల్పాచార్యులు భస్మ, రుద్రాక్షమాలా విభూషితులై సదా వేదాధ్యయనమొనర్చును. శరణాగతత్రాణ బిరుదాంకితులై వెలయుచుండిరి. ఆ శిల్పాచార్యులు తమ శిల్పకళానైపుణ్య ముట్టిపడునట్లు సువర్ణ, రజిత, తామ్ర, కాంశ్యాది లోహంబులతో విగ్రహములు చేయుచుండిరి. వెండి పన్నెండువంతులు, రాగి పదునారు వంతులు, బంగారు పదివంతులు కలిపి మిశ్రమలోహము న దైవ

౨౧వ విజయవాడ పుస్తక మహోత్సవ విశేషాలు

స్వరాజ్యమైదానం లో ౨౧వ విజయవాడ పుస్తక మహోత్సవం ఘనంగా మొదలయ్యింది. ప్రతి సంవత్సరం జనవరి ౧ నుంచి ౧౧ వరకు జరుగుతుంది. విజయవాడ నుంచే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రదేశాల నుండి పుస్తక ప్రియులు ఇక్కడికి వస్తుంటారు. సాహిత్య, పాఠ్య, శాస్త్ర సంబంధిత, ఇంకా అనేక రకాల పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి. ఒక సాహిత్యవేదికను కూడా ఏర్పాటు చేశారు. ఆ సాహిత్యవేదికకు మల్లాది రామకృష్ణశాస్త్రి గారి పేరు పెట్టారు. ఈ పుస్తకమహోత్సవ నిర్వాహకులు, తమ స్వంత ఖర్చులతో సుమారు 40,000 పుస్తకాలతో ఒక గ్రంథాలయన్ని నడుపుతున్నారు. నేను రెండు రోజులు వెళ్ళాను. అక్కడ జరిగిన విషయాలను మీతో పంచుకోవాలని.... నాకు గుర్తున్నంత వరకు, అర్థమైనంత వరకు రాస్తున్నాను, ఏమైనా తప్పులుంటే అవన్నీ నావే... గొల్లపూడి గారిని చూడటం, రావూరి భరద్వాజ, మృణాళిని గార్లతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి రోజు విజయవాడ మేయర్, జిల్లా కలక్టర్ గారు, గొల్లపూడి మారుతీరావు గారూ, తమిళ కవి పొన్నీలన్ గారూ విచ్చేసారు. గొల్లపూడి గారు : కృష్ణా జిల్లా భాషనే పత్రికలలకు ప్రామాణికం అని చెప్పారు. కృష్ణా పత్రిక సంపాదకులు, ఇంకా మొదటి తరం సంపాదకులు చాలా మంది కృ