ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అక్టోబర్, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

స్కాంత రాతికోట కథ (చరిత్రలో చెఱిగిపోయిన యదార్థ గాధ)

భారతదేశము చిన్న చిన్న స్వతంత్ర రాజ్యములుగానుండి రాజుల ఏలుబడి యందుండెను. దక్షిణ భారతదేశ ప్రాంతమున "మంధోటి" యను పట్టణనము రాజధానిగా గల ఒక స్వతంత్ర రాజ్యమున కొన్ని అనివార్య కారణమువలన రాజులేని కారణమున అరాజకమేర్పడి సమర్ధులగు వారసులెవ్వరును లేని కారణమున పరిపాలనా దక్షుని ఎన్నికకై రాజ శాసనముననుసరించి రాజవంశ పూర్వాచార ప్రకారము, కఠినమగు యుక్తితో గూడిన నియమము నొకదానినినేర్పటు జేసి, ఆ పోటీలో గెల్చినవారికి రాజ్యాధికారము కలుగునని రాజ్యము నలుమూలల చాటింపు గావించి ఆ రాజ్యమునకు తగిన రాజుకొరకు రాజప్రతినిధులు వెదకుచుండిరి... అది ఒక కుగ్రామము. గ్రామచావిడికి ప్రక్కగా శిల్పి బ్రహ్మయ్యాచార్యులవారి "అగ్నిశాల" కలదు. బ్రహ్మయ్యాచార్యులు పంచమవేదమైన ప్రణవవేద అధ్యయనమొనర్చిన ఓంకారోపాసకుడు. సకల ఆగమ శాస్త్రకోవిదుడు, పంచశిల్ప ప్రవీణుడు అయిన శిల్పాచార్య బ్రహ్మయ్యాఁచార్యులు తమ పెద్దలవద్ద నేర్చుకొన్న కులవృత్తిచే "అగ్నిశాల" యందు గ్రామవాసుల కవసరమైన పార, కర్రు, కాడి, మేడి, చెంబు, చెరవ, నగ నట్రలు మొదలగు సకల జనోపయోగ నిత్యావసర వస్తువుల తయారు చేసి గ్రామస్తులకు సకాలమున నందించి తన "జగద్గురు వంశ&q

ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు - ఆరుద్ర

ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో  ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు? ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతాని

మోహనాంగి

కొండూరి వారిచే అద్భుతముగా తీర్చి దిద్దబడిన చారిత్రాత్మక నవల ఇది. సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయల పుత్రిక తిరుమలాంబ. ఆమెను రాయలు మోహనాంగి యను ముద్దుపేరున పిలుచుకొనువాడు. మోహనాంగి సంగీత సాహిత్యములందు అపర సరస్వతి;చిత్ర కళానిధి; మారీచీపరిణయమును వ్రాసిన మహాకవయిత్రి. అరవీటి రామరాజునకు అర్ధాంగియైన సాధ్వీతిలకము. మోహనాంగీ రామరాజులను నాయికా నాయకులనుగా వరించిన చరిత్రాత్మకమగు నవల యిది. అయినను మోహనాంగి కథకే ప్రాధాన్యమెక్కువ. పూర్తి పుస్తకం కోసం  మోహనాంగి క్లిక్ చేయండి. Digital Library of India వారి సౌజన్యంతో (http:// www.new.dli.ernet.in/ )

మన తెలుగు తెలుసుకుందాం

మానవుడికీ పశువుకీ గల ముఖ్యమైన తేడాల్లో భాష ఒకటి. ఒక జాతి సంస్కృతిగానీ, చరిత్ర గానీ కళలు గానీ, సాహిత్యం గానీ అన్నీ భాష మీదే ఆధారపడి ఉంటాయి. అభిప్రాయాల్ని వ్యక్తపరిచే ఒక సాధనం భాష... తెలుగు భాషకి ఎన్ని పేర్లున్నాయి? అవి ఎలా వచ్చాయి?.. ఋగ్వేదంలోనే 'ఆంధ్ర' పదం ఉంది... పూర్తి పుస్తకం కోసం మన తెలుగు తెలుసుకుందాం క్లిక్ చేయండి.

అమరావతి

అమరావతి పేరు విన్నంతనే ప్రతి ఆంధ్రుని హృదయముకూడ ఉప్పొంగి పోవును; ప్రతి భక్తుని చిత్తము గూడ భక్తితో తన్మయమగును. ప్రాచీనకాలపు విజ్ఞాన వైభవమునకు, శిల్పకళా ప్రాభవమునకు, అఖండ బౌద్ధ సంస్కృతికి గురుపీఠమై దేశదేశాంతరములలో నాగరికతా దీప్తులను ప్రసరింపజేసిన అమరావతి ఆంధ్రులకే కాదు, భారతీయులందరికిని ఆరాధింప దగిన పవిత్రస్థానము; స్మరింపదగిన చారిత్రక ప్రదేశము. శాతవాహన రాజులు మగధ నుండి కన్యాకుమారిదాక దక్షిణాపథమును పాలించెడి రోజులలో కృష్ణానది యొడ్డున నున్న ధాన్యకటకము దక్షిణదేశపు నగరములకన్నింటికిని తలపూవై ప్రకాశించినది... పూర్తి పుస్తకం కోసం అమరావతి క్లిక్ చేయండి.

భోజరాజీయము

దర్శనాచార్య శ్రీ కొండూరు వీర రాఘవచార్యులచే సంగ్రహించబడిన భోజరాజీయము. పూర్తి పుస్తకం కోసం  భోజరాజీయము క్లిక్ చేయండి.

మందార మకరందాలు

బమ్మెర పోతన భాగవతం లోని కొన్ని పద్యమందారాలకు సి.నారాయణ రెడ్డి గారి మకరంద వ్యాఖ్యానం. పూర్తి పుస్తకం కోసం  మందార మకరందాలు క్లిక్ చేయండి.

ఆకాశభారతి - ఆచార్య తూమాటి దొణప్ప

ఆకాశవాణి ముఖంగా - విజయవాడ, విశాఖపట్నం, హైద్రాబాదు కేంద్రాల నుంచి - వివిధాంశాలపై ఆచార్య తూమాటి దొణప్ప గారు కావించిన ప్రసంగాల సంపుటి. ఆకాశవాణి ముఖంగా చర్చా గోష్ఠులలోనూ, సమీక్షారూపంలోనూ, సంచికా కార్యక్రమాలలోనూ, ఇతరత్రానూ ప్రసారమైన ప్రసంగాల సంపుటీకరణం ప్రస్తుత పుస్తకం ఆకాశభారతి. పుస్తకం కోసం ఆకాశభారతి క్లిక్ చేయండి.

భేతాళ కథలు (చందమామ)

చందమామ భేతాళ కథల కోసం  ఇక్కడ క్లిక్ చెయ్యండి.

భోగకాంత నిర్ణయము

 తాపీ ధర్మారావు గారి 'సాహితీ మొర్మొరాలు' పుస్తకం నుంచి ఓ వ్యాసం నిజమెంతో అబద్ధమెంతో తెలియదు గానీ , ఒక చిన్న కథ చెప్పుకుంటారు , సంస్కృతసాహిత్యం చదువుకున్నవారు . ఈ సంగతయినా కథగా చెప్పుకోరు . పెద్ద చరిత్రాత్మకమయిన విషయంగా చెప్పుతారు . ఏది ఎలాగున్నా , అది విమర్శకులు వినవలసినదే . కాబట్టి మనవి చేస్తాను . చెప్పుకొనే కథ ధారా నగరమో, ఉజ్జయినీ నగరమో ఏదో నగరము . మహారాజుగారి కొలువుకూటం . పని ముగిసిపోయింది . సాయంకాలం ౪ గంటలవేళ ( ఇప్పటి వాచీల ప్రకారం ) అయింది . ఇద్దరు యువకవులు పని ఏమీ లేక పోవడం చేత అలా షికారు బయలుదేరారు . ఎక్కడికి ? వేశ్యవాటికకు - అంటే భోగం వీధికి . దుష్టచింతతో కాదు . సౌందర్య పిపాసతో . వేశ్యవాటికలు ఆ రోజులలో వేశ్యవాటికలు అంటే యిప్పటి భోగం వీధులలాగా వుండేవి కావు . అప్పటి వేశ్యలూ యిప్పటి భోగంవాళ్ళలాగా వుండేవారు కారు . వేశ్యలు బాగా చదువులలోనూ , సంగీతంలోనూ , కళలలోనూ కౌశలం వున్నవారు . వేశ్య వాటికలకు పోవడం ఆ రోజులలో - ఎందుచేతనో యిప్పటంత హేయంగా వుండేది కాదు . ఆ రోజులలో సాయంకాలం నాలుగు గంటలవేళకు