ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2010లోని పోస్ట్‌లను చూపుతోంది

అగస్త్యుడు

శ్రీ రామరక్ష : జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రము తిన్న గుగ్గిళ్ళు జీర్ణమై ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణమై భీముడు తిన్న పండివంటలు జీర్ణమై అర్జునుడు తిన్న అప్పాలు జీర్ణమై అబ్బాయి తిన్న పాలు ఉగ్గు జీర్ణమై కుంది లాగా కూర్చొని నంది లాగా లేచి తాంబేలు లాగా తాళి చల్లగా ఉండాలి శ్రీరామ రక్ష నూరేళ్ళాయుస్సు తి.తి.దే వారి హిందూ ధర్మ పరిచయం పుస్తకం నుంచి - శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారు బిడ్డకు వుగ్గుపెట్టి పొట్ట నిమురుతూ మెల్లిగా కాలుచేతులు ముడిచి సాగదీస్తూ తల్లులు ఈ పాట పాడుతారు. తనబిడ్డ అగస్త్యుడిమాదిరి తిన్నది అరిగించుకుని దినదినాభివృద్ధి పొందుతూ ఆరోగ్యవంతుడై, ఆయుష్మంతుడై సుఖంగా వుండాలని తల్లి కోరుకుంటుంది. ప్రాతః స్మరణీయుడైన ఈ అగస్త్యుడు దైవాంశసంభూతుడు. మహా తపస్వి. ఉదారచరితుడు. కరుణాస్వభావుడు. వీర్యవిక్రమసంపన్నుడు. ఆయన త్యాగమయ జీవితం చతుర్యుగాలకు విస్తరించి వుంది. జననం:            అగస్త్యుడు మనమాదిరి మాతృగర్భం నుంచి ఉదయించలేదు. కలశం నుంచి ఉద్భవించాడు. ఆయన పుట్టుక బహు విచిత్రమైనది. ఇక్ష్వాకు పుత్రుడైన నిమి అనే రాజు తన కులపురోహితుడైన వసిష్ఠ మహర్షితో "నేను ఒక

ధర్మపాల విజయము

ఉత్తర భారతావనిలో కళలకు కాణాచియై కళ్యాణపురంబు కలదు. అందు శిల్పకళాకోవిదుడైన విశ్వకర్మ వంశీయుడగు ధర్మపాలుడు అను శిల్పాచార్యుడు కలడు. అతడు విద్యలలో బృహస్పతితో సమానుడు. సకల శాస్త్ర మంత్రసిద్ధుడు. అతని శిల్పచాతుర్యమునకు ప్రభువులు మెచ్చి అర్థాసనమిచ్చి గౌరవించిరి. అతనినాశ్రయించి ఎందరో శిల్పకళాకోవిదులు జీవించుచున్నారు. అతని శిల్పశాలయందు అగ్ని, జల, వాయు యంత్రములు అమర్చబడియున్నవి. ఆ కళాక్షేత్రమున కులదైవములగు శ్రీ విశ్వకర్మ భగవానుడు, శ్రీ కామాక్షిదేవి ఆలయములు నిర్మించి ప్రతిష్టించి నిత్యము శిల్పాచార్యులు ఆరాధించుచుందురు. ఆ ధర్మపాలునకు రుద్రసేన, భద్రసేన, ఇంద్రసేనులను కుమారులు గలరు. వారు తండ్రితో సమాన ప్రతిభావంతులు. నియమ నిష్టాగరిష్టులు, మంత్రవేత్తలు. గదా, ఖడ్గ, బాణ యుద్ధములలో నిపుణులు. ఆ శిల్పాచార్యులు భస్మ, రుద్రాక్షమాలా విభూషితులై సదా వేదాధ్యయనమొనర్చును. శరణాగతత్రాణ బిరుదాంకితులై వెలయుచుండిరి. ఆ శిల్పాచార్యులు తమ శిల్పకళానైపుణ్య ముట్టిపడునట్లు సువర్ణ, రజిత, తామ్ర, కాంశ్యాది లోహంబులతో విగ్రహములు చేయుచుండిరి. వెండి పన్నెండువంతులు, రాగి పదునారు వంతులు, బంగారు పదివంతులు కలిపి మిశ్రమలోహము న దైవ

౨౧వ విజయవాడ పుస్తక మహోత్సవ విశేషాలు

స్వరాజ్యమైదానం లో ౨౧వ విజయవాడ పుస్తక మహోత్సవం ఘనంగా మొదలయ్యింది. ప్రతి సంవత్సరం జనవరి ౧ నుంచి ౧౧ వరకు జరుగుతుంది. విజయవాడ నుంచే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రదేశాల నుండి పుస్తక ప్రియులు ఇక్కడికి వస్తుంటారు. సాహిత్య, పాఠ్య, శాస్త్ర సంబంధిత, ఇంకా అనేక రకాల పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి. ఒక సాహిత్యవేదికను కూడా ఏర్పాటు చేశారు. ఆ సాహిత్యవేదికకు మల్లాది రామకృష్ణశాస్త్రి గారి పేరు పెట్టారు. ఈ పుస్తకమహోత్సవ నిర్వాహకులు, తమ స్వంత ఖర్చులతో సుమారు 40,000 పుస్తకాలతో ఒక గ్రంథాలయన్ని నడుపుతున్నారు. నేను రెండు రోజులు వెళ్ళాను. అక్కడ జరిగిన విషయాలను మీతో పంచుకోవాలని.... నాకు గుర్తున్నంత వరకు, అర్థమైనంత వరకు రాస్తున్నాను, ఏమైనా తప్పులుంటే అవన్నీ నావే... గొల్లపూడి గారిని చూడటం, రావూరి భరద్వాజ, మృణాళిని గార్లతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి రోజు విజయవాడ మేయర్, జిల్లా కలక్టర్ గారు, గొల్లపూడి మారుతీరావు గారూ, తమిళ కవి పొన్నీలన్ గారూ విచ్చేసారు. గొల్లపూడి గారు : కృష్ణా జిల్లా భాషనే పత్రికలలకు ప్రామాణికం అని చెప్పారు. కృష్ణా పత్రిక సంపాదకులు, ఇంకా మొదటి తరం సంపాదకులు చాలా మంది కృ