తాపీ ధర్మారావు గారి 'సాహితీ మొర్మొరాలు' పుస్తకం నుంచి ఓ వ్యాసం.
వామనావతార ఘట్టములో పోతన్న చూపిన కవిత్వ పటత్వము అసాధారణము. ఆ ఘట్టాన్ని అంత సమర్ధతతో చిత్రించగల కవులు ఒకరిద్దరికి మించి ఉండరు. బలిచక్రవర్తి దానాన్ని గ్రహించి, వామనుడు త్రివిక్రముడై బ్రహ్మాండం నిండిపోతాడు. వటు డింతింతై మరింతయి పెరిగిపోతూండడం పోతన్న హృదయానికి ప్రత్యక్షంగా కనిపిస్తూంది. ఆ విధంగానే పాఠకునికి గూడా కనబడాలి గదా ఆ బ్రహ్మాండత్వం పాఠకునికి ప్రస్ఫుటం కావాలి గదా అలా జరిగినప్పుడే కదా ఆ రసం పలికినట్టవుతుంది
ఇంతింతై వటు డింతయై మరియు దా
నింతై , తోయదమండలాగ్రమున క
ల్లంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపై
నంతై, మహార్వాటిపై
నంతై, సత్యపదోన్నతుం డగుచు బ్ర
హ్మాండాంత సంవర్ధియై
అని వర్ణించాడు. ఆకాశవీధి, మేఘమండలము, కాంతిరాశి, చంద్రుడు, ధ్రువుడు, మహర్వాటి, సత్యపదమూ అని ఆ రూపాన్ని పెంచాడు. కాని - ఆ బ్రహ్మాండత్వం పాఠకులకు కరతలామలకంగా కనిపించిందా ఆ మహాద్భుతాకార మెంత పెద్దదో కంటికి కట్టినట్టయిందా తృప్తి లేదు. కాబట్టే
రవిబింబం బుపమింప బాత్రమగు ఛ
త్రంబై, శిరోరత్నమై,
శ్రవణాలంకృతియై, గళాభరణమై,
సౌవర్ణ కేయూరమై,
ఛవిమత్కంకణమై, కటిస్థలి మదం
చద్ఘంగయై, సూపుర
ప్రవరంబై, పదపీఠమై వటుడు దా
బ్రహ్మాండము న్నిండుచోన్.
అని వర్ణించి కృతార్థుడయ్యాడు. ఆ మహాద్భత రూపాన్ని ప్రత్యక్షంగా చూపించి పాఠకులను చరితార్థులను జేశాడు.
నడి మింట నున్న సూర్యబిబాన్ని చూడమన్నాడు. అది ఎంత యెత్తున వుందో, ఎంత పైకి పోతే దాన్ని తాకగలమో, ఊహారూపంగా ప్రతి పాఠకుడికీ తెలుసును. దృష్టిని ఆ బింబం మీదనే వుంచి, పోతన్న వామనుడిని పెంచాడు. వామనుడి కది గొడుగులా గుందన్నాడు. ఇంకా పెంచాడు. ఇప్పుడా బింబం తలలో పెట్టుకున్న రత్నంలా గుందన్నాడు. ఇంకా పెంచాడు. చెవిపోగులాగుంది. ఇంకా - మెడ నున్న రత్నంలాగ ఇంకా - భజకీర్తిలాగ ఇంకా - ముంజేతి కంకణం లాగ ఇంకా మొలనూలి మువ్వలాగ, ఇంకా - కాలి అందెలాగ, ఇంకా పెంచాడు - ఆ బింబం పాద పీఠం లాగ వుందన్నాడు. ఎంత పెద్ద ఆకారాన్ని ఎంత స్ఫుటంగా చిత్రించాడో చూడండి. పోతన్న శిల్ప నైపుణ్యం ఏమనగలం. మన మహాకవులెందరీ మహాకార్య మింత అందంగా నిర్వర్తించ గలరు.
వామనావతార ఘట్టములో పోతన్న చూపిన కవిత్వ పటత్వము అసాధారణము. ఆ ఘట్టాన్ని అంత సమర్ధతతో చిత్రించగల కవులు ఒకరిద్దరికి మించి ఉండరు. బలిచక్రవర్తి దానాన్ని గ్రహించి, వామనుడు త్రివిక్రముడై బ్రహ్మాండం నిండిపోతాడు. వటు డింతింతై మరింతయి పెరిగిపోతూండడం పోతన్న హృదయానికి ప్రత్యక్షంగా కనిపిస్తూంది. ఆ విధంగానే పాఠకునికి గూడా కనబడాలి గదా ఆ బ్రహ్మాండత్వం పాఠకునికి ప్రస్ఫుటం కావాలి గదా అలా జరిగినప్పుడే కదా ఆ రసం పలికినట్టవుతుంది
ఇంతింతై వటు డింతయై మరియు దా
నింతై , తోయదమండలాగ్రమున క
ల్లంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపై
నంతై, మహార్వాటిపై
నంతై, సత్యపదోన్నతుం డగుచు బ్ర
హ్మాండాంత సంవర్ధియై
అని వర్ణించాడు. ఆకాశవీధి, మేఘమండలము, కాంతిరాశి, చంద్రుడు, ధ్రువుడు, మహర్వాటి, సత్యపదమూ అని ఆ రూపాన్ని పెంచాడు. కాని - ఆ బ్రహ్మాండత్వం పాఠకులకు కరతలామలకంగా కనిపించిందా ఆ మహాద్భుతాకార మెంత పెద్దదో కంటికి కట్టినట్టయిందా తృప్తి లేదు. కాబట్టే
రవిబింబం బుపమింప బాత్రమగు ఛ
త్రంబై, శిరోరత్నమై,
శ్రవణాలంకృతియై, గళాభరణమై,
సౌవర్ణ కేయూరమై,
ఛవిమత్కంకణమై, కటిస్థలి మదం
చద్ఘంగయై, సూపుర
ప్రవరంబై, పదపీఠమై వటుడు దా
బ్రహ్మాండము న్నిండుచోన్.
అని వర్ణించి కృతార్థుడయ్యాడు. ఆ మహాద్భత రూపాన్ని ప్రత్యక్షంగా చూపించి పాఠకులను చరితార్థులను జేశాడు.
నడి మింట నున్న సూర్యబిబాన్ని చూడమన్నాడు. అది ఎంత యెత్తున వుందో, ఎంత పైకి పోతే దాన్ని తాకగలమో, ఊహారూపంగా ప్రతి పాఠకుడికీ తెలుసును. దృష్టిని ఆ బింబం మీదనే వుంచి, పోతన్న వామనుడిని పెంచాడు. వామనుడి కది గొడుగులా గుందన్నాడు. ఇంకా పెంచాడు. ఇప్పుడా బింబం తలలో పెట్టుకున్న రత్నంలా గుందన్నాడు. ఇంకా పెంచాడు. చెవిపోగులాగుంది. ఇంకా - మెడ నున్న రత్నంలాగ ఇంకా - భజకీర్తిలాగ ఇంకా - ముంజేతి కంకణం లాగ ఇంకా మొలనూలి మువ్వలాగ, ఇంకా - కాలి అందెలాగ, ఇంకా పెంచాడు - ఆ బింబం పాద పీఠం లాగ వుందన్నాడు. ఎంత పెద్ద ఆకారాన్ని ఎంత స్ఫుటంగా చిత్రించాడో చూడండి. పోతన్న శిల్ప నైపుణ్యం ఏమనగలం. మన మహాకవులెందరీ మహాకార్య మింత అందంగా నిర్వర్తించ గలరు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి